‘గోపాల గోపాల’ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘సర్దార్’ అనే టైటిల్ ఖరారు చేసారు. ప్రముఖ నిర్మాత శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఇటీవలే షూటింగ్  ప్రారంభమయ్యింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని ఓ అల్యుమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ మరియు కొంత మంది ఫైటర్స్ పై భారీ యాక్షన్ సన్నీవేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగనుంది.
ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని తెలిసింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం కోసం దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే సంగీతాన్ని, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.












150వ సినిమా అంటూ గత రెండేళ్లుగా ఊదరగొట్టిన మెగా క్యాంప్ ఇప్పుడు సమయం దగ్గర పడుతున్నా ఇంకా చడీ చప్పుడు చేయకుండా సైలెంట్ గా ఉంటూ ఇంకా సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారు . ఆగష్టు 22చిరంజీవి పుట్టినరోజు కావడంతో మెగా అభిమానుల్లో టెన్షన్ ఎక్కువ అవుతోంది . ఎందుకంటే చిరు పుట్టినరోజున 150వ సినిమా ప్రారంభం అవుతుందని ఇంతకుముందే ప్రకటించారు కానీ ఇప్పుడేమో సమయం దగ్గరౌతున్న కొద్దీ సైలెంట్ గా ఉంటూ సస్పెన్స్ లోనే ఉంచుతున్నారు . చిరు సినిమాకి పూరి దర్శకుడని ప్రకటించారు కానీ మద్యలో వినాయక్ కూడా లైన్ లో ఉన్నాడని సెలవిచ్చారు . దాంతో ఇంకా టెన్షన్ పెరుగుతూనే ఉంది . అసలు చిరు సినిమా ఉంటుందా? లేదా ?ఉంటే దర్శకుడు ఎవరు ? ఆ సినిమా ఎప్పుడు ? చెప్పకుండా ఇంకా సస్పెన్స్ ఏంటి బాసూ ? 




ప్రిన్స్ మహేష్‌బాబు- శృతిహాసన్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శ్రీమంతుడు’. ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆగ‌స్టు 7న తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్‌ వీడియోలు ఒక్కొక్కటిగా వదులుతున్నారు. తాజాగా శ్రీమంతుడు సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు లీక్ అయ్యింది.

శ్రీమంతుడు సినిమాలో మ‌హేష్ మొత్తం ఏడు డిఫ‌రెంట్ లుక్స్‌తో క‌నిపిస్తాడ‌ట‌. ఇవి చాలా స్టైలీష్‌గా ఉంటాయ‌ని తెలుస్తోంది. స్టోరీకి ఉన్న ఇంపార్టెన్స్ దృష్ట్యానే ఈ స్టైలీష్‌లుక్స్‌తో మ‌హేష్ క‌నిపిస్తాడ‌ని మహేష్‌కి స్టైలిష్ట్‌గా పనిచేసిన అక్షయ్‌త్యాగి ఈవిషయాన్ని వెల్లడించాడు. ఈ లుక్స్ అన్నీ సినిమాకే చాలా హైలెట్ కానున్నాయ‌ట‌.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో బిజినెస్‌ మ్యాగ్నెట్‌గా, కాలేజీ కుర్రాడిలా, మాస్‌ హీరోగా ఉన్న లుక్స్‌ని చూపించారు. మరి ఆ మిగతా లుక్స్‌ చూడాలంటే ఆగష్టు 7వరకు ఆగాల్సిందే. మైత్రీ మూవీస్ ప‌తాకంపై తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు మిర్చి ఫేం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించిన సంగీతానికి ఇప్ప‌టికే గుడ్ రెస్పాన్స్ వ‌చ్చింది.


S Rajamouli ended Baahubali – The beginning with a twist, that is, loyal slave Kattapa killed Amarendra Baahubali. Everyone are eager to find out the reason and this question is haunting all sections of the audiences.

Social media is abuzz with this question. Now, the story writer of Baahubali, Vijendra Prasad raised a sudden twist saying that ‘why do you think Kattapa killed Baahubali?’

His statements created many doubts and even raised curiosity among the audience. Speaking to a leading daily, V Vijayendra Prasad said “Why do you think Kattappa killed Baahubali? He only stabbed him”.

It seems that Kattapa only stabbed Baahubali with a knife as Bhallaladeva asked him to kill Baahubali. But, we are thinking that Bijjaladeva and Bhallaladeva together killed Baahubali after Kattapa’s nabbing with a knife.

 We have to wait till 2016 to know the exact reason….


దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇది అనాదిగా వస్తున్న నానుడిని ఆతరం హీరో శోభన్ బాబు పాటించాడు రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టి  వేలకోట్లు సంపాదించాడు . కాగా ఆ బాట ని శోభన్ బాబు నుండి స్పూర్తి పొందిన నటీనటులు తెలుగులో చాలామందే ఉన్నారు కాగా ఇప్పుడు ఈ తరం హీరో ఎన్టీఆర్ కూడా అందులో అడుగు పెట్టాడట . అయితే శోభన్ బాబు భూములను కొంటే ఎన్టీఆర్ మాత్రం హైదరాబాద్ లోని కొన్ని ప్లాట్ లను కొని వాటిని అద్దె కు ఇచ్చాడట దాంతో నెల నెల కొంత మొత్తం వస్తుంది అంతేకాదు భవిష్యత్ లో ఆ పెట్టుబడి మరింతగా పెరుగుతుంది కాబట్టి ఇది మంచి మార్గమే అని అనుకున్నాడట ఎన్టీఆర్ . పైగా తనకు పిల్లనిచ్చిన మామ నార్నే కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండటం వల్ల ఇటువంటి విషయాలలో నార్నే అనుభవం కూడా పనికొస్తుంది 




టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అందాల ముద్దుగుమ్మ నయనతార పై ప్రేమ కురిపిస్తున్నాడు . మహేష్ నయన్ పై ప్రేమ కురిపించడం ఏంటి ? అని అనుకుంటు న్నారా ?ఆ ప్రేమకు కారణం ఏమిటంటే  తన శ్రీమంతుడు చిత్రం తో పాటు నయనతార నటించిన ''మయూరి '' చిత్ర ట్రైలర్ కూడా ప్రదర్శించబోతున్నారు . శ్రీమంతుడు చిత్రం తో మయూరి ట్రైలర్ ని ప్రదర్శించడం వల్ల నయనతార కు లాభం జరుగుతుందని భావిస్తున్నారు,  అందుకే మహేష్ సినిమాతో పాటు నయన్ వస్తోంది . శ్రీమంతుడు చిత్రం ఆగష్టు 7న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు . 





రామ్ చరణ్ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో రామ్ చరణ్ స్టంట్ మాస్టర్‌గా నటిస్తున్నాడు. అంటే సినిమా పరిశ్రమతో లింక్ ఉన్న చిత్రం కావడంతో స్టార్ హీరోలు ఈ చిత్రంలో కనిపించనున్నారన్నమాట. చిరు, నాగార్జునాలకు ఫైట్స్ కంపోజ్ చేసే సన్నివేశాలు ఈ సినిమాలో చూపించనున్నారట. కాగా ఈ సినిమా కోసం ఎవరైనా స్టార్ హీరోతో వాయిస్ ఓవర్ ఇప్పించాలని అనుకున్నాడట దర్శకుడు శ్రీనువైట.్ల దీంతో ఎన్టీఆర్‌ను సంప్రదించడం  విషయం చెప్పడం, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయట. జూనియర్‌కు, రామ్ చరణ్‌కి మద్య బావా.. బావా అని పిలుచుకునేంత సాన్నిహిత్యం ఉంది. అదీ కాక శ్రీనువైట్లతో ఎన్టీఆర్ బాద్‌షా తీశాడు కూడా. ఆ సాన్నిహిత్యం వల్లే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎన్టీఆర్ ఒప్పుకున్నాడట. గతంలో జల్సా కోసం మహేష్ బాబు, మర్యాద రామన్న కోసం రవితేజ, రుద్రమ దేవి కోసం చిరంజీవిలు వాయిస్ ఇచ్చారు. ఇలా ఏ బేషజా        లేకుండా ఒక హీరో కోసం మరొకరు సహాయం చేయడం మంచి పరిణామమే.. ఇలాంటి పరిణామాల వల్ల అభిమానుల మద్య సఖ్యత పెరుగుతుంది.


బాహుబలి భారీ విజయం సాధించినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం ప్రభాస్ పేరు కంటే రానా పేరు మారుమోగిపోయింది దాంతో ప్రభాస్ రూటు మార్చాడు. బాహుబలి యూనిట్ తో వెళ్ళే కంటే తన పెద్దనాన్న అయిన కృష్ణంరాజు అధికార బిజెపి లీడర్ కావడంతో ఆయనకు  ఢిల్లీ లో ఉన్న పరిచయాలను అవకాశంగా చేసుకొని నేనేంటో చెప్పాలని అనుకున్నాడట అందుకే దేశరాజధాని ఢిల్లీ వెళ్లి బిజెపి నాయకులను కేంద్రమంత్రులను ,ప్రధానమంత్రి ని కూడా కలిసి బాహుబలి చిత్రాన్ని చూడమని కోరడమే కాకుండా వాళ్ళ అటెన్షన్ కొట్టేసాడు ప్రభాస్ . కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ,ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ లు తమ కుటుంబ సమేతంగా బాహుబలి చిత్రాన్ని చూసి ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తారు . ఇక ప్రధాని మోడీ అయితే బాహుబలి ని కలిసానని ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు . దాంతో ప్రభాస్ ఎత్తు పారి అసలు సిసలు బాహుబలి అయ్యాడు . 






The audio launch event of 'Puli' will be held on August 2nd in Chennai and according to sources, the film's lead actor VIjay has invited Chiranjeevi and Mahesh Babu for the event.

Mahesh is said to have accepted the invitation. The audio of 'Selvandhan', the Tamil version of 'Srimanthudu', will be launched on 31st July in Chennai and the Superstar will grace the event. Devi Sri Prasad composed music for both the films. Let's see if Vijay graces the audio launch of Selvandhan.





త్రివిక్రమ్ వంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా నిర్మించాలంటే మాటలు కాదు. దాదాపుగా ఓ స్టార్ హీరోతో సమానంగా రెమ్యూనరేషన్ అందుకునే మాటల మాంత్రికుడు... ఈ సారి రొటిన్ కు భిన్నంగా స్టార్ హీరోకు బదులు యంగ్ హీరో నితిన్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న చాలామంది సినీ జనం... త్రివిక్రమ్ శ్రీనివాస్ నితిన్ తో సినిమా తెరకెక్కించనుండటంపై ఆశ్చర్యపోయారు. నాగచైతన్య, నితిన్ లలో ఎవరో ఒకరితో సినిమా చేయాల్సి రావడంతో... త్రివిక్రమ్ నితిన్ ను ఎంచుకున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే... ఈ సినిమా కోసం తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ ను సినిమా మొదలుకావడానికి ముందుగానే అందుకున్నాడట టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.
మామూలుగా అయితే హీరోలు, దర్శకుల సినిమాకు కమిటయ్యే ముందు రెమ్యూనరేషన్ లోని కొంత భాగాన్ని అడ్వాన్స్ గా తీసుకుంటారు. సినిమా పూర్తై... బిజినెస్ జరిగిన తరువాత మొత్తం పేమెంట్ ను నిర్మాతలు వీరికి ముట్టజెబుతుంటారు. కానీ త్రివిక్రమ్ మాత్రం నితిన్ తో తెరకెక్కించబోయే సినిమాకు అందుకోబోయే మొత్తం 10 కోట్ల రెమ్యూనరేషన్ ను ముందుగానే అందుకున్నాడట. ఈ సినిమా నైజాం రైట్స్ ను, శాటిలైట్ హక్కులను షూటింగ్ మొదలుకావడానికి ముందే తను కొనుగోలు చేస్తానని హామీ ఇవ్వడంతో నిర్మాతలు త్రివిక్రమ్ కు పూర్తి రెమ్యూనరేషన్ ను ముందుగానే ఇచ్చినట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి... ఈ మధ్య కాలంలో మాస్ డైరెక్టర్ వినాయక్ కూడా అల్లుడు శీను సినిమాకు ఈ తరహాలో మొత్తం రెమ్యూనరేషన్ ను షూటింగ్ కు ముందుగానే పుచ్చుకున్నాడని... మళ్లీ త్రివిక్రమ్ కే ఇది సాధ్యమైందని సినీ జనం అనుకుంటున్నారు. మరి షూటింగ్ కు ముందే రెమ్యూనరేషన్ మొత్తాన్నిఅందుకున్న త్రివిక్రమ్... నిర్మాతలకు, హీరో నితిన్ కు ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.





StylishStar AlluArjuns Rudhramadevi #Rudhramadevi is not just Tollywood's first Stereoscopic 3D film but the Nation's First Historical Stereoscopic 3D and it's a bilingual Tamil - Telugu film being dubbed into Malayalam & Hindi.
4K with Dolby Atmos


హీరోయిన్ లకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ముఖ్యంగా దక్షినాది చిత్రలో ఇలా జరుగుతోందని హీరోయిన్ గ్లామర్ ని వాడుకుంటున్నారు కానీ తగిన ప్రాధాన్యత మాత్రం ఇవ్వడం లేదని గరం గరం అవుతోంది పొగరుబోతు భామ నిత్యా మీనన్ . దక్షినాది లో హీరోలకే ప్రాముఖ్యత ఇస్తున్నారని హీరోయిన్ లను కేవలం గ్లామర్ కె పరిమితం చేస్తున్నారని కానీ నేను అలా కాదని కథలో ప్రాముఖ్యత లేకపోతే నేను నటించనని అదృష్టం కొద్దీ నాకు మంచి పాత్రలు లభిస్తున్నాయని అంది నిత్యా మీనన్ . 






Tags:1 Nenokkadine, Mahesh Babu, Nenokkadine, Sukumar