baahubali 2 movie new twist
ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సాధించిన వసూళ్లతో ప్రతి ఒక్కరు బాహుబలి 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా స్టోరీ రైటర్, దర్శకుడు రాజమౌళి తండ్రి. ఇటీవల సినిమా విజయోత్సవంలో మీడియాకు ఇంటర్వూలు ఇస్తున్నారు. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో బాహుబలి 2 స్టోరీలో అత్తాకోడళ్లైన శివగామి (రమ్యకృష్ణ), దేవసేన(అనుష్క) మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందని చెప్పారు.
బాహుబలి 2 గురించి ఆయన మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఈ పార్ట్లో ముగ్గురు ప్రభాస్లు, ఇద్దరు అనుష్కలు కూడా ఉంటారని తెలిపారు. ఇక అనుష్క, రమ్యకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాల్లో ఇద్దరు పోటాపోటీగా నటించారని..ప్రేక్షకులు వీరి నటన చూసి మైమరచిపోతారని..ఆ రేంజ్లో వీరు తమ నటనతో మెప్పిస్తారని ఆయన తెలిపారు.
ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాహుబలి 2ను వచ్చే సంవత్సరం రిలీజ్ చేస్తామని కూడా ఆయన చెప్పారు.
Category: FILM NEWS
0 comments